మృత్యుకంపం
అది
గుజరాత్లోని
ఒక గ్రామం. అన్ని గ్రామాలకు
లాగే దానికీ ఒక పేరుండేది.
1956లో వచ్చిన భూకంపంలో గ్రామం
నేలమట్టమయింది. అప్పటి
ప్రధాని నెహ్రూ ఆ ప్రాంతాన్ని సందర్శించారు.
తిరిగి కట్టిన ఊరికి
జవహర్నగర్ అని పేరు పెట్టుకున్నారు.
50 ఏళ్లు నిండకముందే జనవరి
26న వచ్చిన భూకంపంలో ఊరు
మరోసారి మట్టిదిబ్బగా
మారింది. ఈ సారి ఇంకా ఆ ఊరిని
ఎవరూ సందర్శించినట్లు
వార్తలు రాలేదు.
గుజరాత్ భూకంపం మొత్తం
దేశాన్ని కుదిపింది.
నష్టం మాత్రం ఆ రాష్ర్టంలోనే
ఎక్కువగా జరిగింది. భుజ్, రాజ్కోట్, జమ్నగర్, సురేంద్రనగర్, పాటన్ మొదలయిన
నగరాలన్నింటిలోనూ పెద్ద
ఎత్తున నష్టం జరిగింది. భుజ్లో 90
శాతం ఇళ్ల,
భవనాలు కూలిపోయాయి. జరిగిన ప్రాణ
నష్టం గురించి రకరకాల
అంచనాలు వస్తున్నాయి. 25,000 నుండి మొదలయిన
ఈ అంకె ఎక్కడ నిలబడుతుందో
తెలియదు. కూలిన
భవనాల కింద కూరకుపోయిన
వారింక ఎందరున్నారో తెలియదు. జరిగిన ధన నష్టం 25 వేల కోట్లని
ఒక అంచనా!
ప్రకృతి వైపరీత్యాలు
మనిషికి కొత్తేమి కాదు. అయితే అవి వచ్చి
తగిలే దాకా వాటిని గురించి
పట్టనట్టే బతకడం మాత్రం
అలవాటు. భూకంపం
వచ్చింది. మానసికంగా
మొత్తం ప్రపంచాన్ని కదిలించింది. ఇక కొంతకాలం
వరకు అందరూ భూకంపాలను
గురించి ఆలోచించడం సహజం. కొద్దిపాటి
భయంతో గడపడమూ సహజం.
కాలంతో బాటే ఈ సంఘటనలో
మరుపున పడతాయి.
మళ్ళీ ఎక్కడో ఎప్పుడో
మరో ఉత్పాతం జరుగుతుంది. అందరినీ తట్టి
లేపుతుంది. ఉత్పాతాలకు కారణం కొన్ని
సందర్భాలలో వేల ఏళ్లగా
కొనసాగుతూ ఉంటుంది. జరిగే సంఘటన
మెరుపులా సెకండ్లు, నిమిషాల్లో
ముగుస్తుంది. అంతులేని హానికి
కారణమవుతుంది.
గతంలో
జరిగిన సంఘటన వివరాలు, విధ్వంసం, అంతగా ప్రపంచానికి
అందేవి కావు. ఇప్పుడు పరిస్థితి మారింది. దేశంలోని మారుమూల
పల్లెలో ప్రజలు టివిలో
దృశ్యాలను చూచి,
గుండె కరిగి, సహాయంతో ముందుకు
వచ్చారంటే పరిస్థితిని
అర్థం చేసుకోవచ్చు. మనుషుల్లో
మంచితనం ఉందనడానికి ఇటువంటి
సంఘటనల తర్వాత సాక్ష్యాలు
బయటపడతాయి. మనుషుల్లో పిరికితనం
కూడా ఉందని మరోవైపు సాక్ష్యాలుంటాయి. గుజరాత్లోనే కాదు
దేశంలో మరెన్నో చోట్ల
భూకంపం వస్తుందని వదంతులు
అప్పుడే మొదలయ్యాయి. ఒక పెద్ద భూకంపం
తర్వాత చిన్న చిన్న భూకంపాలు
రావడం మామూలే. అలాంటి భూకంపాలు
వచ్చాయి కూడా! అవి కథలల్లే వారికి
మరింత బలాన్నిచ్చాయి. (మార్చి
నెలలో హైదరాబాద్లో భూకంపం
తప్పదనీ, అందుకు
కారణం నీళ్లు పడని బోర్ బావులని
ఒక ఇంట్లో మాట్లాడుకోవడం
నేను స్వయంగా విన్నాను - రచయిత) ఇంకేముంది?
అంతా అయిపోతుంది. అని చేతులు
వెల్లకిల వేస్తున్న వారూ
ఉన్నారు. ఇటువంటి
సమయాల్లో కావలసింది సరైన
సమాచారం. దాని
గురించి అవగాహన!
సూర్యుడు మండుతుండే
అగ్నిగోళం. అందులోంచి కొంత పదార్థం
బయటపడి భూమి తయారయింది. పై పొరలు చల్ల
బడ్డాయి. ఆ పొర
మీద నీరు చుట్టు గాలితో
కూడిన వాతావరణం ఏర్పడ్డాయి. పరిస్థితులు
అనుకూలించడంతో జీవం పుట్టింది. అది పరిణామానికి
గురవుతూ మనుషులూ వచ్చేశారు. తెలివిగల మానవజాతి
తన పరిసరాలను, పరిస్థితిని అర్థం
చేసుకోవాలనే ప్రయత్నంలో
ఉంది. చాలా చాలా
విషయాలు మనిషికి అర్థమయినట్లే
లెక్క. అటు తన స్వంత మెదడు, ఇటు ప్రకృతి
మాత్రం మనిషికి ఇంక అంతు
పట్టలేదు. రెండూ
కలిసి మొత్తం జాతిని
గగ్గోలు పెడుతున్నాయి. ప్రకృతి నిరంతరం
హెచ్చరిస్తూనే ఉంటుంది. `నీ బ్రతుకు
నీవనుకున్నంత సుఖమయం
కాదు'! అంటుంది. ప్రకృతి వైపరీత్యాలనుండి
అనునిత్యం వెంటాడే శీతోష్ణస్థితి, కాలుష్యం దాకా
అడుగడుగునా అపాయాలే!
ఎండా, వానా, నీరు, గాలి, అన్నీ అవసరమే. అన్నీ మనకు
అనుకూలంగా ఉండే పద్ధతిలో
అవసరం. అంగుళం
మేర దాటి ముందుకు జరిగినా
ఇవన్నీ ప్రమాదాలవుతాయి. అగ్నిగోళం
మీద బ్రతుకుతున్నాం. అనుక్షణం ఆపదల్లో
ఉన్నాం!
విరిగే
కొండ చరియలనుంచి, పొగ మంచు దాకా 20కి పైగా వైపరీత్యాలను
పరిశోధకులు గుర్తించారు. గతంలో ఐక్యరాజ్యసమితి
వారు ఒక దశాబ్దంపాటు
వైపరీత్యాల గురించి అవగాహన, పరిశోధన పెంచడానికి
ఒక కార్యక్రమం నిర్వహించారు. అప్పుడు ఎన్నెన్నో
వివరాలు, విశ్లేషణలు
అందుబాటులోకి వచ్చాయి. వైపరీత్యాల్లో
భూకంపాలకే పెద్ద పీట, నిజానికి భూమి
కంపిస్తూనే ఉంటుంది. లోపలి పొరల్లో
ఉడుకుతూనే ఉంది. గట్టి పడిన పైపొరల్లో
ప్లేట్స ఉన్నాయి. అవి కదులుతూ సర్దుకుంటూ
ఉంటాయి. భారతదేశం
ఒకప్పుడు ఆసియా నుంచి
విడిగా ఉండేది. ఉత్తరంగా కదులుతూ
వచ్చి యూరేసియన్ ప్లేట్ మధ్య
రాపిడి ఇంకా కొనసాగుతూనే
ఉంది. గుద్దుకున్నప్పుడు
ప్లేట్లలో కొన్నినెరియలుపడి
ఉంటాయి. అవి
భూగర్భంలో ఉండే బలహీనమైన
ప్రాంతాలు. అటువంటి ప్రాంతాలలోనే
భూకంపాల ప్రభావం ఎక్కువగా
ఉంటుంది.
పరికరాలు అవసరం లేకుండానే
గుర్తించగల భూకంపాలు
ఏటా 50,000 దాకా
వస్తుంటాయి ఇందులో నుంచి
వంద దాకా భూకంపాలు పెద్ద
నష్టాన్ని కలిగించగలుగుతాయి. మరీ గొప్ప హాని
కలిగించే భూకంపం సగటున
ఏటా ఒకటయినా వస్తుందని
పరిశోధకులు సంపాదించిన
సమాచారం చెబుతుంది.
అందరూ గమనించవలసిన విషయం
ఒకటి ఉంది. వెంట
వెంటనే గొప్ప హాని కలిగించిన
భూకంపాలు రెండు మూడు
వచ్చిన సంఘటనలు చరిత్రలో
లేవు. కాబట్టి
ఇవాళో, రేపో, ఇంకో నెలలోనో
మన దగ్గరా కొంపలు కూలుతాయనుకోవడం
తప్పు. మనిషికి
ప్రకృతితో బాటు మెదడు
కూడా అదుపులోకి రాలేదనడానికి
ఇదొక ఉదహరణ మాత్రమే. పరిశోధకులు
కూడా ఇదే మాట నిస్సందేహంగా
చెబుతున్నారు.
భూకంపం తర్వాత ప్రకృతి
వైపరీత్యాలలో చెప్పుకోదగినవి
అగ్ని పర్వతాల పేలుళ్లు. ఇటీవలే పొపొకాట
ఫెటిల్ అనే అగ్ని పర్వతం
పేలింది. పేలేముందు
అది కొంచెం భయపెడుతుంది. మనుషులకు జాగ్రత్త
పడే వీలుంటుంది. తుఫానులు, సుడిగాలులు, వరదలు, వానలు మొదలయిన వాతావరణ
సంబంధ వైపరీత్యాలను గురించి
కూడా ఈ మధ్యన చాలా ముందుగానే
సూచించగలుగుతున్నారు. అందుకని రాను
రాను జన నష్టం తగ్గుతున్నది. వడగళ్లు కూడా
వైపరీత్యాల్లోకే వస్తాయి. మనదేశంలో అగ్ని
పర్వతాలు లేవు. వడగళ్లు పంటలకు నష్టం
కలిగిస్తాయి గానీ, మనుషులకు నష్టం
కలిగించే సైజుకు రానే
రావు. వానలు
లేకపోతే వచ్చే కరువు
కాటకాలు కూడా ప్రకృతి
వైపరీత్యాలే! వాటి గురించి కూడా
ముందే తెలుస్తుంది. వచ్చిన చిక్కంతా
భూకంపాలతోనే ఉన్నట్లుంది.
భూకంపాల గురించి పరిశోధనలు
జరిపే జాతీయ భూభౌతిక
పరిశోధన సంస్థ ఎన్జిఆర్ఐ హైదరాబాద్లోనే ఉంది. చిన్నా చితకా
కదలికలు వచ్చినప్పుడు
కూడా వాళ్లు వెంటనే రంగంలోకి దిగి
అందరికీ వివరాలను అందిస్తూనే
ఉన్నారు. భూకంపం
గురించి సమయం, ప్రదేశాలను ముందే
గుర్తించి ఎప్పడం వీలుకాదని
వాళు్ళ ఒప్పుకుంటున్నారు. అయితే ప్రకృతిలోనే
సూచనలు అందుతాయని, వాటిని అందుకుని
తగిన జాగ్రత్తలు తీసుకోవడం
చేతగావాలని అంటున్నారు
పరిశోధకులు. జంతువులు విపరీతంగా
ప్రవర్తించడం, బావులలో నీటిమట్టం
ఒక్కసారిగా హెచ్చుతగ్గలకు
గురికావడం భూకంపాలకు
ముందు సాధారణంగా జరుగుతాయి. వీటిని ప్రజలు
అంత గట్టి సూచనలుగా భావించకపోవడం
సహజం. వీటికన్నా
ముఖ్యమైన మూడు సూచనలున్నాయి.
భూమి
లోపల జరుగుతన్న గడబిడకు
గుర్తుగా రేడియో ఆక్టివ్ వాయువులు
నేలలో నుండి వెలువడడం
వీటిలో మొదటిది. లాతూర్